యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం పవిత్రోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకారంలోని అద్దాల మండపం ముందుభాగంలో అంకురార్పణతో పూజలు ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో అగ్నిప్రతిష్ఠ గావించారు. దేవతామూల మంత్రాలతో హవనం నిర్వహించారు. ఆలయ ఈఓ ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీరసింహాచార్యులు పాల్గొన్నారు.
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో ఆదివారం స్వామివారి పవిత్రోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకారంలోని అద్దాల మండపం ముందు భాగంలో అంకురార్పణతో పవిత్రోత్సవాలను పంచరాత్రాగమశాస్త్రరీతిలో ప్రారంభించారు. స్వస్తీ వాచనం, విశ్వక్సేనుడికి శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక పీఠంపై మూడు ప్రధాన కలశాలను ఏర్పాటు చేసి గంగాజలంతో గర్భాలయంతోపాటు ఆలయ పరిసరాలు, భక్తుల క్యూలైన్లను సంప్రోక్షణ గావించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో అంకురార్పణ చేశారు. 12 పాలికల్లో పుట్టమట్టిని తెచ్చి వాటిలో నవ ధాన్యాలు, పంచామృతాలను పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశం చేసి అగ్నిప్రతిష్ఠ గావించారు. దేవతా మూలమంత్రాలతో హవనం నిర్వహించారు. ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనారసింహాచార్యులు, మోహనాచార్యులు, అధికారి భాస్కర్ పాల్గొన్నారు .