– కట్టంగూర్ సర్పంచ్ శ్యామల శేఖర్
కట్టంగూర్, ఫిబ్రవరి 16 : ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ అన్నారు. సోమవారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను వైద్య సిబ్బంది, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఔషధాల సరఫరా, సిబ్బంది హాజరు, శుభ్రత, వంటి అంశాలపై వైద్యాధికారి శ్వేతతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆస్పత్రిలో శుభ్రత పాటించడంతో పాటు తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. ప్రజలు ఆరోగ్య కేంద్ర సేవలను వినియోగించుకోవాలని, చిన్న అనారోగ్య సమస్యలకే పట్టణాలకు వెళ్లకుండా ఇక్కడే చికిత్స పొందాలని సూచించారు.