దేవరకొండ: టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డు నుంచి మండల స్ధాయి వరకు కమిటీలు వేయాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీలో చురుగ్గా పనిచేసే కార్యకర్తలను గుర్తించి వార్డు కమిటీలు ఏర్పాటు చేయాని, సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ కమిటీలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
13 నుంచి 20 వరకు మండల, పట్టణ స్థాయి కమిటీలు వేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ఒక మండలం నుంచి కమిటీలు వేసేందుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించనున్నట్లు రవీంద్రకుమార్ తెలి పారు. కమిటీల్లో 51 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు అవకాశం కల్పించాలన్నారు. పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచినప్పుడే గ్రామాల్లో అంతే స్థాయిలో ఎన్నికలకు పోగలుగు తామని ఎమ్మెల్యే చెప్పారు.
సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నర్సింహా, ఎంపీపీలు నల్లగాసు జాన్యాదవ్, వంగాల ప్రతాప్రెడ్డి, జడ్పీటీసీ మారుపాకుల అరుణగౌడ్, టీఆర్ఎస్ నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణ య్య, రాజీనేని వెంకటేశ్వర్రావు, ఉజ్జిని విద్యాసాగర్రావు, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, వైస్ చైర్మన్ రహత్అలీ, మా ర్కెట్ వైస్ చైర్మన్ గొపిడి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్రెడ్డి, నట్వ గిరిధర్, వల్లపు రెడ్డి, తూం నాగార్జు న్రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు, హన్మంత్ వెంకటేశ్గౌడ్, దేవేందర్నాయక్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.