నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి17(నమస్తే తెలంగాణ) / యాదాద్రి భువనగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు వివిధ వర్గాల ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సూర్యాపేటలో తన క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్రెడ్డి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 70 కిలోల భారీ కేక్ను కట్ చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ను మంత్రి జగదీశ్రెడ్డి బహూకరించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి మంత్రి జగదీశ్రెడ్డి మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్నిచోట్ల అన్నదానాలు, మొక్కలు నాటుతూ తమ అభిమానాన్ని చాటారు. తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. తిరుమలగిరిలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. కోదాడలోని క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నదానం నిర్వహించారు. అనంతరం తమ్మారం బ్రిడ్జి వద్ద రోడ్డుకు ఇరువైపులా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగ్గా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నల్లగొండలోని మెగా రక్తదాన శిబిరంతో పాటు పలుచోట్ల భాగస్వాములయ్యారు.
మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 690 మందితో రక్తదానం ఏర్పాటు చేయగా అంతకుమించి స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచే ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు రక్తదానంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. దాంతో జిల్లా కార్యాలయంలో రోజంతా సందడి నెలకొంది. మొక్కలు నాటిన అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి జగదీశ్రెడ్డి కేక్కట్ చేశారు.
తర్వాత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో మంత్రి జగదీశ్రెడ్డి స్వయంగా రక్తదానం చేసి యువతలో, పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తినింపారు. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి రక్తదానం చేస్తూ తమ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన యువతకు ఉత్తేజాన్నిచ్చారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్రావు, పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి రక్తదానంలో పాల్గొన్నారు.
మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు మూడు గంటల పాటు అక్కడే ఉండి, రక్తదానం చేస్తున్న యువత వద్దకు వెళ్లి పేరుపేరునా పలకరిస్తూ అందర్నీ అభినందించారు. దాంతో రికార్డు స్థాయిలో సుమా రు 700 మంది రక్తదానం చేశారు. అంతకుముందు నల్లగొండ పట్టణంలో పానగల్ ఛాయ సోమేశ్వరాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో మృత్యుంజయ ఆయుష్ హోమం నిర్వహించగా మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎంపీ బడుగులతో జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్యులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం నకిరేకల్ ముఖ్య కూడలిలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. మిర్యాలగూడలోని అన్ని చోట్ల వేడుకలు జరగ్గా ఎమ్మెల్యే భాస్కర్రావు తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అగ్రోస్ సంస్థ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డితో కలిసి మొక్కలు నాటి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. దేవరకొండ, కొండ మల్లేపల్లి చౌరస్తాలో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నియోజకవర్గమంతటా పార్టీ శ్రేణులు వేడుకల్లో పాల్గొన్నారు.
హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్ తన క్యాంపు కార్యాలయంలో కేక్కట్ చేసి మొ క్కలు నాటారు. అనంతరం నిడమనూర్లోని ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థ్ధులతో కలిసి ఎమ్మెల్యే భగత్కుమార్ వేడుకల్లో పాల్గొన్నారు. రెండు లక్షల విలువైన వాటర్ ప్లాంట్ను ప్రారంభించగా విద్యార్థ్ధులు హ్యాపీ బర్త్డే కేసీఆర్ అని వచ్చేలా అక్షరాల రూపంలో కూర్చుని అభిమానాన్ని చాటుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి కేక్కట్ చేసి మొక్కలు నాటారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, అభిమానులు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నకిరేకల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేశారు.
తెలంగాణ అభివృద్ధి ప్రదాత, దేశ్ కీ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానం వెల్లువెత్తింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంబరాన్నంటిన సంబురాలే ఇందుకు సాక్ష్యం. కేక్ కటింగ్లు, స్వీట్ల పంపిణీలు, అన్నదానాలు, రక్తదానాలు, మొక్కల నాటింపు, సర్వమత పార్థనలు, గిఫ్ట్ ఎ స్మైల్ కింద చేయూత.. వంటి అనేక కార్యక్రమాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం పండుగ
వాతావరణం కనిపించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. స్వయంగా మంత్రి గుంటకండ్ల, పలువురు ఎమ్మెల్యేలు రక్తదానం చేసి స్ఫూర్తిని చాటారు. పానగల్ ఛాయాసోమేశ్వరాలయంలో మృత్యంజయ ఆయుష్షు హోమం నిర్వహించగా, మంత్రితోపాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు. అంతకుముందు సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీశ్రెడ్డి సర్వమత ప్రార్థనలు చేయించారు. యాదగిరిగుట్ట ఆలయంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మహాసుదర్శన యాగం నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా ఆయా నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
యాదాద్రి జిల్లా అంతటా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. యాదగిరిగుట్ట ఆలయంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రత్యేకంగా మహా సుదర్శన యాగం నిర్వహించారు. ఆలయ అర్చకులతో కేసీఆర్కు ఆయురారోగ్యాలు కలగాలని ప్రత్యేకంగా అర్చన చేయిస్తూ పూజలు చేశారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మోత్కూరులో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి మాధవరెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, చౌటుప్పల్లో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ కేక్ కట్ చేశారు. రాజాపేట మండలం రఘునాథపురంలో రైతులు పంట పొలాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడే జన్మదిన వేడుకలను నిర్వహించగా మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి నల్లగొండలో జరిగిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.