కోదాడ, ఆగస్టు 04 : ప్రగతిశీల భావాలతో పౌరహక్కుల రక్షణకు హైకోర్టు సీనియర్ న్యాయవాది, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దివంగత పద్మనాభరెడ్డి అవిశ్రాంత పోరాటం చేశారని పలువురు న్యాయవాదులు కొనియాడారు. సోమవారం పద్మనాభరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా కోదాడ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. అట్టడుగు హక్కుల కోసం పద్మనాభరెడ్డి హైకోర్టులో నిరంతరం న్యాయ పోరాటం సాగించి బాధితులకు అండగా నిలిచారన్నారు.
మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన ప్రతి సందర్భంలోనూ తన గళాన్ని వినిపించి బాధితులకు అండగా నిలిచారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గట్ల నరసింహారావు, కోదాడ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, కార్యదర్శి వెంకటాచలం, సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి, శరత్ బాబు, యశ్వంత్, సిలివేరు వెంకటేశ్వర్లు, ఉయ్యాల నరసయ్య, హేమలత, మురళి, శ్రీధర్, వెంకన్న, పెద్దబ్బాయి పాల్గొన్నారు.