కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు గత కొద్దిరోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో నిరాటంకంగా కొనసాగుతుంది. బుధవారం ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు.
ఎగువ ప్రాంతాల నుంచి 3413.75 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా 1973.96 క్యూసెక్కు లు, కుడి కాలువకు 95.43 క్యూసెక్కులు, ఎడమ కాలువ కు 48.21 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.70 అడుగులుగా (4.12 టీఎంసీలు)గా నిల్వ ఉన్నట్లు ఏఈ డి.ఉదయ్కుమార్ తెలిపారు.