యాదగిరిగుట్ట, ఫిబ్రవరి10 : తెలంగాణకు కృష్ణాజలాల వాటాను తేల్చే వరకు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన ఉద్యమాన్ని ఆపేదిలేదని మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, గొంగిడి సునీతామహేందర్రెడ్డి తేల్చి చెప్పారు. గుట్టచప్పుడుగా కృష్ణాజలాలను సీఎం రేవంత్రెడ్డి కేంద్రానికి అప్పగించి పాలమూరు, రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలను ఏడారిగా మారుస్తామంటే ఊరుకునేది లేదన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సూదగాని హరిశంకర్గౌడ్తో కలిసి ఈ నెల 13న నల్లగొండలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బహిరంగ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు.
సభ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లగొండ సభకు ఆలేరు నియోజకవర్గం నుంచి 12 వేల మందిని తరలిస్తామన్నారు. 13న ఉదయం 10 గంటలకే నల్లగొండకు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కృష్ణా జలాల్లో 75 శాతం వాటా మనకే చెందుతుందని బచావత్ ట్రిబ్యునల్ చెప్పినా అమలు చేయలేదన్నారు. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశాక ఇప్పటి వరకు కృషాజలాల వాటపై తేల్చకుండా తాత్చారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి ఆంధ్ర ప్రభుత్వానికి తొత్తుగా మారి రాష్ట్ర హక్కులు, వాటాలను రాసిస్తున్నారని మండిపడ్డారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో నదీజలాల గొడవలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెల్లలోనే కృష్ణాజలాలను కేంద్రానికి రాసిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణాజలాలను తీసుకొచ్చి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను సస్యశ్యామలంగా మార్చాల్సింది పోయి కేంద్రానికి అప్పగించడంపై మండిపడ్డారు. కాంగెస్ అధికారంలోని రాగానే జనవరి 17న కేంద్ర ప్రభుత్వ సంస్థ కేఆర్ఎంబీకి అప్పగించిందని ఆరోపించారు. నల్లగొండ జిల్లా రైతాంగాన్ని దీనిపై ఆలోచింపజేసి కృష్ణాజలాలను రాబట్టేందుకే మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండ వేదికగా ఉద్యమానికి తెర తీశారని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం స్వచ్ఛందంగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రాంతానికి అధిక వాటా రావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి జల వివాదానికి తెర లేపిందని పేర్కొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్కు ప్రతి రైతు అండగా నిలువాలన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సూదగాని హరిశంకర్గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే రైతులను అరిగోస పెడుతుందన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, బీఆర్ఎస్ వివిధ మండలాల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, బీసు చందర్గౌడ్, బొట్ల యాదయ్య, నరేందర్రెడ్డి, గంగుల శ్రీనివాస్, జడ్పీటీసీలు పల్లా వెంకట్రెడ్డి, తోటకూరి అనూరాధ, గోపాల్గౌడ్, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ గడ్డమీది రవీందర్గౌడ్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్, నాయకులు పాల్గొన్నారు.