– నల్లగొండ జీజీహెచ్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా.నాగేశ్ తీరుపై నర్సింగ్ ఆఫీసర్స్ ఫైర్
– కనీస మౌలిక సదుపాయాల లేమిపై ఆందోళన
– సెక్యూరిటీ, శానిటేషన్కు తమనే బాధ్యులను చేస్తున్నారని ఆవేదన
నీలగిరి, ఆగస్టు 25 : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్స్ మంగళవారం ఆందోళన బాట పట్టారు. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా.నాగేశ్ తీరును తీవ్రంగా నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో మొత్తం నర్సింగ్ ఆఫీసర్స్లో 80 శాతం మంది ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నట్లు, తామంతా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాగేందుకు నీళ్లు ఉండవని, వాష్ రూమ్స్, డ్రెస్ చేంజ్ రూమ్స్ ఉండవన్నారు. కనీస మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారన్నారు. మిడ్నైట్లో సెక్యూరిటీ ఉండదు. శానిటేషన్ విభాగం ప్రాపర్గా ఉండదు. అన్నింటికి నర్సింగ్ ఆఫీసర్స్నే బాధ్యులను చేస్తున్నట్లు వాపోయారు. సదరు కారణాలు చూపిస్తూ ఒక్క ఆగస్టు నెలలోనే 14 మంది ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్కు మోమోలు ఇవ్వడం దారుణ విషయమన్నారు.
ప్రధానంగా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా.నాగేశ్ నర్సింగ్ ఆఫీసర్స్ఫైన చాలా అక్కసతో ఉంటున్నట్లు వెల్లడించారు. చెప్పుకోలేని పదాలతో తమను దుర్భాషలాడుతున్నట్లు చెప్పారు. సెక్యూరిటీ లోపమున్నా, పారిశుధ్య లోపమున్నా ఇలా అన్నింటికి నర్సింగ్ ఆఫీసర్స్ను కారణంగా చూపించి మోమోలు ఇస్తూ తమను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రోగులతో ప్రేమగా ఉండండి అని తమకు చెప్పే అధికారులు అతే తీరుగా ఉద్యోగులతో ఉండాలని వారికి తెలియదా అని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలు ఇదే విధమైన ప్రవర్తనతో వేగుతూ ఇక భరించలేక నేడు బయటకు వచ్చి ఇలా తమ వేదనను వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నర్సింగ్ ఆఫీసర్స్ ఆందోళనపై డిప్యూటీ సూపరింటెండెంట్ డా.నగేశ్ను నమస్తే తెలంగాణ వివరణ కోరగా వివరణ కోరగా ఈ నెల 23న మెడికల్ లీగల్ కేసు కు సంబంధించి ఓ రోగు ఆస్పత్రిలో చేరి, అదే రోజు రాత్రి వెళ్లిపోయినట్లు తెలిపారు. అయినా 24న ఆ రోగి ఉన్నట్లు, అతడికి వైద్యం అందించినట్లు రికార్డుల్లో రాశారు. ఈ విషయమై సదరు డాక్టర్లు, స్టాఫ్ నర్సులకు మోమోలు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

నాలుగేండ్లుగా వేధింపులు.. ఇక భరించలేక ఆందోళన బాట