రామగిరి, జనవరి 5 : ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపికైన వలంటీర్లు జాతీ య స్థాయిలో నిర్వహించే శిబిరంలో సత్తా చాటి మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఖ్యాతి చాటాలని ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి ఆకాంక్షించారు. జాతీయ సమైక్యతా శిబిరానికి ఉమ్మడి జిల్లాలోని కళాశాలల వలంటీర్ల ఎంపికను శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన వలంటీర్లకు కమ్యూనికేషన్ స్కిల్స్, భాషా పరిజ్ఞానం, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేశారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. విద్యతోపాటు సామాజిక సేవకు ఎన్ఎస్ఎస్ చక్కని వేదిక అని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఆర్.హరికిషన్రావు, వివిధ కళాశాలల పీఓలు పాల్గొన్నారు.
మహిళల విభాగంలో ఎ.స్వప్న(టీఎస్డబ్ల్యూ ఆర్డీసీ, నల్లగొండ), వి.నిత్య(ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, దేవరకొండ), పురుషుల విభాగంలో ఈ.వెంకటేశ్(ఆర్ట్స్ కళాశాల, ఎంజీయూ), బి.మహేశ్(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మిర్యాలగూడ) ఉన్నారు.