హాలియా, నవంబర్ 9: రాష్ట్రంలో బీఆర్ఎస్ పా ర్టీకి తిరుగులేదని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మె ల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్తో పాటు జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ అంగోతు భగవాన్నాయక్తో కలసి ఆయన నిడమనూరు ఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధి కారి శ్రీనివాస్కు నామినేషన్ పత్రాన్ని అందజే శారు. అనంతరం ఎమ్మెల్యే భగత్కుమార్ మీడియాతో మాట్లాడారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈసారి కూడా గెలుపు తనదేనని దీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ ఫలం అందని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే కొంత మందితో రోడ్రోలర్ గుర్తు వచ్చేలా నామినేషన్ వేయిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా విజయం బీఆర్ఎస్దే అన్నారు.
ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ గురువారం నకిరేకల్ మండలంలోని పాలెంలోని తన తండ్రి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య సమా ధి వద్దకు వెళ్లి పూలమాల వేసి నివాళులర్పిం చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తన తండ్రి ఆశయం కోసం పునరాకింత మైనట్లు భగతకుమార్ తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఆయన సతీమణి నోముల భవాని, కుటుంబ సభ్యులు తదితరులున్నారు.
త్రిపురారం: మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన రజక, కుమ్మరి, యాదవ కుటుంబాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, నిడమనూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనుముల శ్రీనివాస్రెడ్డి మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు బీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు తెలిపారు. జంగిలి శ్రీనివాస్, కిలారి శ్రీను, నలపరాజు పెదపాపయ్య, ముత్తమ్మ, కోటే ష్, రాములు, లచ్చమ్మ, కౌసల్య, రాజేశ్వరిలతోపాటు బీఆర్ఎస్ నాయకులు కాశయ్య, యా దమ్మ, బాలరాణి, సుగుణమ్మ, చింతకాయల యాదయ్య తదితరులున్నారు.
హాలియా : ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గురువారం గుర్రంపోడు మండలం వట్టికోడు, మాడుగులపల్లి మండలం అవంగపు రం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే భగత్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నట్లు తెలి పారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా ఉందన్నారు.
రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24గంటల కరెంట్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, బీసీ బంధు, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు కాం గ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేవు అన్నారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని రూ.16వేలకు పెంచడంతో పాటు రూ.400 కే గ్యాస్ సిలిండర్, రేషన్ షాప్ ద్వారా ప్రతి ఇంటికి సన్నబియ్యం వంటి పథకాలు అమలు చేస్తారని తెలిపారు. జానారెడ్డికి, ఆయన కుమారుడికి అధికార దాహం తప్ప నియోజకవర్గంపై ఒక విజన్ లేదని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు జానారెడ్డిని ఏడు సార్లు గెలిపిస్తే ఆయన చేసిన అ భివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి నిరోధక పార్టీ అని ఎద్దేవా చేశారు.
ప్రజలకు మేలు చేయడం అనేది ఆ పార్టీ నాయకుల రక్తంలోనే లేదని అన్నారు. 70 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని కేసీఆర్ ఆశీస్సులతో రెండున్నరేండ్లలోనే చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు బీఆర్ఎస్ పార్టీదే అని దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ విజ యం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్లో చేరిన వారి లో సిలివేరు లింగయ్య, పోలేని నరేందర్, షేక్ లతీఫ్, రాంబాబు, సిలువేరు ఆంజనేయులుతో పాటు మరో 20మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాదం సంపత్కుమార్, సర్పంచ్ యాదగిరిరెడ్డి, మాజీ ఎంపీటీసీ కేసారి వెంకట్రెడ్డి, పోలోజు నర్సింహ్మా, ఊర జనార్థన్, మార్కెట్ డైరేక్టర్ పడిగిపల్లి నరేష్, ఖాసీం, యాదగిరిరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు.
త్రిపురారం: జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నోముల భగత్ దుబ్బ క్వార్టర్స్లో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో శ్రీని వాస్రెడ్డి, అవిరెండ్ల సైదులు, బైరంకృష్ణ, శ్రీను, నాగుల్మీరా, సైదులు, లింగయ్య పాల్గొన్నారు.