యాదాద్రి, నవంబర్ 28 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు సోమవారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. ఉదయం 3.30గంటలకు స్వయంభూ నారసింహుడి ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో మేల్కొల్పి తిరువారాధన, స్వామి, అమ్మవార్లకు బాలబోగం నిర్వహించారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు.
స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పుకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను ఉంచి నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయం త్రం స్వామి, అమ్మవార్లను గరుఢ, తిరుచ్చీ వాహనాలపై ఉంచి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. రాత్రి దర్బార్ సేవ, నివేదన, శయనోత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
రామలింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు నిర్వహించారు. సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. సుమారు 17వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలతో స్వామివారి ఖజానాకు రూ.21,72,237 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి అనుబంధ పర్వత వర్ధిణీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులచే నిర్వహించే నిత్య రుద్రహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు హోమాన్ని రామలింగేశ్వర స్వామివారి ఆలయంలోని యాగశాలలో నిర్వహిస్తున్నామన్నారు. రూ. 1,000 చెల్లించి భక్తులు హోమంలో పాల్గొనేందుకు వీలు కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,41,250
వీఐపీ దర్శనాలు 30,000
బ్రేక్ దర్శనం 73,200
వేద ఆశీర్వచనం 8,400
నిత్య కైంకర్యాలు 1,000
సుప్రభాతం 6,000
ప్రచార శాఖ 14,600
వ్రత పూజలు 1,44,800
కళ్యాణకట్ట టిక్కెట్లు 80,700
ప్రసాద విక్రయం 11,50,800
వాహనపూజలు 23,600
అన్నదాన విరాళం 9,919
శాశ్వత పూజలు 15,000
సువర్ణ పుష్పార్చన 79,560
యాదరుషి నిలయం 73,740
పాతగుట్ట నుంచి 1,09,130
కొండపైకి వాహన ప్రవేశం 2,75,000
శివాలయం 22,900
ఇతర విభాగాలు 14,929