యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 25 : యాదగిరిగుట్టలోని స్వయంభువుడు లక్ష్మీనరసింహ స్వామికి నిత్యోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో భక్తుల సందడి కొనసాగింది. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామి దర్శనానికి భక్తుల అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ప్రధానాలయ ముఖ మండపంలోని క్యూలైన్లలో భక్తుల సందడి కనిపించింది. సుమారు 20వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. స్వామివారి ఖజానాకు రూ.24,72,546 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
శ్రీవారిని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి వికాస్ ఆనంద్, జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ అంజన్కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికి దర్శనానంతరం స్వామివారి ప్రసాదం అందించారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,35,500
వీఐపీ దర్శనాలు 1,05,000
బ్రేక్ దర్శనాలు 2,35,500
వేద ఆశీర్వచనం 8,400
నిత్య కైంకర్యాలు 1,600
సుప్రభాతం 5,400
ప్రచార శాఖ 19,060
వ్రత పూజలు 1,93,600
కల్యాణకట్ట టిక్కెట్లు 82,500
ప్రసాద విక్రయం 10,37,400
వాహన పూజలు 8,300
అన్నదాన విరాళం 37,130
శాశ్వత పూజలు 20,000
సువర్ణ పుష్పార్చన 1,03,600
యాదరుషి నిలయం 91,056
పాతగుట్ట నుంచి 59,000
కొండపైకి వాహన ప్రవేశం 3,00,000
శివాలయం 6,300
పుష్కరిణి 1,500
ఇతర విభాగాలు 22,200