చందంపేట, జూన్ 10 : చందంపేట మండలం చిత్రియాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సాగని నిరంజన్ మృతి బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చిత్రియాల గ్రామంలో నిరంజన్ కుటుంబ సభ్యులకు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, కేతావత్ శంకర్ నాయక్, వంగూరి పాపయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.