యాదగిరిగుట్ట పట్టణంలో అన్ని హంగులతో టీఆర్ఎస్ నూతన భవనం సిద్ధమవుతున్నదని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు.
యాదాద్రి, ఆగస్టు 3 : టీఆర్ఎస్ పార్టీ నూతన భవనం సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుకుంటున్నదని, త్వరలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా భవనాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ భవనం ద్వార ప్రతిష్ఠోత్సవంలో పాల్గొని గడపకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ భవన్ తరహాలో పార్టీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణుల నుంచి సేకరించిన విరాళాలతోనే భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కమలమ్మ, జడ్పీటీసీ తోటకూరి అనూరాధాబీరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, కోఆప్షన్ సభ్యురాలు గొర్ల పద్మ, టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాళ్లు ముక్యర్ల అండాలు, కళ్లెం స్వాతి, యువజన విభాగం నాయకులు ముక్యర్ల సతీశ్ యాదవ్, సర్పంచులు పుల్లయ్యగౌడ్, బీరయ్య, ఆరె స్వరూపామల్లేశ్గౌడ్ పాల్గొన్నారు.