నల్లగొండ: తుది దశలో ఉన్న వైకుంఠ దామాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవా రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి చేసిన వైకుంఠ ధామాల వివరాలు ఎప్పడికప్పుడు ఆన్లైన్ లో పొందు పరచాలని.. ఇప్పడికే పూర్తి చేసిన వాటి వివరాలను ఈ నెల 25లోగా పొందుపర్చాలని అన్నారు.
అంతేకాకుండా వివిధ దశల్లో ఉన్న వైకుంఠధామాలను కూడా అక్టోబర్ 10లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
వీటితో పాటు టాయిలెట్స్, బర్నింగ్ ప్లాట్ ఫామ్స్, వెయిటింగ్ హాల్ లాంటి నిర్మాణాలు కూడా పూర్తి చేయాలన్నారు. ఇసుక సమస్య ఉంటే పరిష్కరిస్తామని..ఇంకా సమస్యలు ఉంటే డీపీవో దృష్టికి తీసుకు రావాలని అన్నారు. హరితహా రంలో భాగంగా ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు ఇవ్వటంతో పాటు ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు.
పల్లె ప్రకృతి వనంతో పాటు బృహత్ పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన మొక్కలు, ఇతరత్రా పనులకు ఈజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీపీవో విష్ణువర్ధ న్ రెడ్డి, జడ్పీ సీఈవో వీర బ్రహ్మచారి, పీఆర్ఈఈ తిరుపత య్య తదితరులు పాల్గొన్నారు.