రామగిరి: పద్యం తెలుగు వారి సోత్తు అని.. అజరామరంగా వేల ఏండ్లుగా పద్యం విలసిల్లుతుంది. దీన్ని భవిష్యత్తు తరా లకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దాశరథి అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త డా.కూరెళ్ల విఠలాచార్య అన్నారు. మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలోని బీసీ స్టడీ సర్కిల్లో నిర్వ హించిన పద్య ప్రభంజనం పుస్తకావిష్కరణ, పరిచయ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరై ఇతర కవులు, రచయితలతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి నిజాం వ్యతిరేక పోరాటంలో ఇటీవల తెలంగాణ ఉద్యమంలోనూ పద్యం విశేషమైన పాత్ర పోషించిందన్నారు. పద్య ప్రభంజనం సంపాదకులు, అష్టావధాని అవుసుల భానుప్రకాశ్ మాట్లాడుతూ సుమారు ఆరు వందల మందికి పైగా కవులు పద్య సంకలనం పద్య ప్రభంజనం పుస్తకంగా ప్రచురించినట్లు వెల్లడించారు. తెలంగాణ లోని పద్య కవులందనిరి ఒక తాటి పైకి తేచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ బృహత్ సంకలనం వెలువరించామన్నారు.
పద్యం నేటి తరం విద్యార్థులకు అందించాలన్నారు. డా. పురుషోత్తమాచార్య సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు, కవులు, రచయితలు మాదగోని శంకరయ్య, డా. బెల్లి యాదయ్య, సాగర్ల సత్తయ్య, పున్న అంజయ్య, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, శీలాఅవిలేనుమొగలి మాల, రాపోలు అరుణ, లింగంపల్లి హేమలత, దాసోజు జ్ఞానే శ్వర్, రావిరాల అంజయ్య, చింతోజు మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.