రామగిరి: సంస్కృతి సంప్రదాయాలను కాపాడుదామని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. వినాయక చవితిని పుర స్కరించుకుని నల్లగొండలోని గడియారం సెంటర్లో నల్లగొండ మున్సిపాల్టీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నల్లగొండ ఆధ్వర్యం లో ఉచితంగా నిర్వహించిన మట్టి గణపతి విగ్రహలను ఆయన పంపిణీ చేశారు. అదేవిధంగా వీటీ కాలనీ పంచముఖ హన్మాన్ దేవాలయం వద్ద గణేశ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేసి మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు. ప్రజలకు ఉచితంగా విగ్రహాలు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, ఐసీడీఎస్ ఆర్సీవో మాలే శరణ్యారెడ్డి, కౌన్సిలర్స్ అభిమన్యు శ్రీనివాస్, ఎడ్ల శ్రీను, రావుల శ్రీనివాస్రెడ్డి, సిరిగిరి సురేశ్రెడ్డి, దోనాల నాగార్జున రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.