నీలగిరి: గర్భిణులు, బాలింతలు నాణ్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సుభద్ర, నల్గొండ సీడీపీవో తూముల నిర్మల అన్నారు. గురువారం జిల్లా జనరల్ దవాఖానలో పోషక మాసోత్సవాల సందర్భంగా అంగన్వాడీలకు, ఆశలకు, గర్భిణులకు, బాలింతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల్లో రక్త హీనత రాకుండా ఉండేందుకు అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పౌష్టికాహారం అం దిస్తున్నదన్నారు.
గర్భిణులు, బాలింతలు, పిల్లలు కిశోర వయస్సు గల వారికి పోషకాహారం ఎంతో అవసరమని, సరైన అవగాహన లేకపో వడం, పేదరికం కారణంగా చాలామంది పోషకాహార లోపంతో రోగాల బారిన పడుతున్నారన్నారు. ఈనేపథ్యంలో వారు తీసుకోవాల్సిన ఆహారం, ఆవశ్యకతను వివరించాలన్నారు. అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు పోషకాహార లోపమున్న పిల్లలందరిని గుర్తించాలన్నారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి నెలా గర్భిణులకు, బాలింతలకు రోజుకు ఒక గుడ్డు చొప్పున నెలకు 30గ్రుడ్లు ఇస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అంతేకాకుండా ఒక పూట పౌష్టికాహారం, కిశోర బాలికలకు 16గుడ్లు ఇవ్వడంతో పాటు బియ్యం కంది పప్పు, మంచి నూనె, ఐఎఫ్ఏ ట్యాబ్లె ట్లు ఇస్తున్నామని తెలిపారు. 6నెలల నుంచి 3సంవత్సరాల వయస్సు ఉన్న బాలబాలికలకు 16 గుడ్లు, 2.5 కిలోల బాలామృతం, 3 నుంచి 6 ఏండ్ల వయస్సు కలిగిన వారికి 30 గుడ్లు ఇస్తున్నామన్నారు. కార్యక్ర మంలో ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ సుచరిత, హేమలత, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశలు తదితరలు పాల్గొన్నారు.