నడిగూడెం ఎంపీపీ జ్యోతి, వైద్యాధికారి లక్ష్మీప్రసన్న
నడిగూడెం/చింతలపాలెం/ హుజూర్నగర్/నేరేడుచర్ల/మోతె/మఠంపల్లి, ఆగస్టు5 : తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష అని నడిగూడెం ఎంపీపీ యాతాకుల జ్యోతి, వైద్యాధికారి లక్ష్మీప్రసన్న అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం నడిగూడెంలో బాలింతలు, గర్భిణులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో వారు మాట్లాడారు. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించాలని సూచించారు. అనంతరం అంగన్వాడీలు, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ బాణాల నాగరాజు, ఐసీడీస్ అధికారి నాగమణి, ఎంపీడీఓ ఇమామ్, ఎంపీఓ లింగారెడ్డి, సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి, వైద్యాధికారి లక్ష్మీప్రసన్న, ఉప సర్పంచ్ నసీమా, సూపర్వైజర్ శివకుమారి, ఏఎన్ఎం రాధ, అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ కొత్తమద్ది వెంకట్రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పొల్నేడి శ్రీనివాస్రావు, ఎంపీడీఓ గ్యామానాయక్, సర్పంచ్ పద్మావతి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయినిగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ హేమాదేవి, అంగన్వాడీ టీచర్ శైలజ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నేరేడుచర్ల మండలంలోని ఫత్తేపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీటీసీ మండల రాజేశ్ మాట్లాడుతూ బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మచ్చ పాపులు, అంగన్వాడీ సూపర్వైజర్ మల్లీశ్వరి, టీచర్లు సుమతి, సుజిత పాల్గొన్నారు. మోతెలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కోటేశ్వరి, సర్పంచ్ మెట్టు అలివేలు, అంగన్వాడీ టీచర్లు పార్వతి, పద్మ, కార్యదర్శి, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. మఠంపల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సోమమ్మ, టీచర్లు రాములమ్మ, రమణ, గోవిందమ్మ, రాధమ్మ పాల్గొన్నారు.