రామగిరి: తెలంగాణ భాష, యాస పట్ల మక్కువ కలిగిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ. పి.విష్ణుదేవ్ అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని ఎంజీయూలో గురువారం నిర్వహించిన వేడు కల్లో ఆయన పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళుల్పరించారు.
అనంతర ఆయన మాట్లాడు తూ కాళోజీకి గౌరవం కల్పించేలా సీఎం కేసీఆర్, మన తెలంగాణ ప్రభుత్వం కాలోజీ పేరుతో యూనివర్సిటీని ఏర్పాటు చేయడం గొప్పవిషయమన్నారు.అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ఇచ్చిందని గుర్తు చేశారు.
కార్యక్రమంలో ఎంజీయూ పాలకమండలి సభ్యులు డా. అంజిరెడ్డి, డాక్టర్ ఆకుల రవి, ప్రిన్సిపాల్ ఉపేందర్రెడ్డి, తెలుగు విభాగం అధ్యాపకులు జి.నర్సింహ్మ, సూడ్టెండ్ వేల్ఫేర్ ఆఫీసర్ ఎల్.మధు, సెక్యూరిటీ ఆఫీసర్ పాపయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.