రామగిరి: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని, దీని కోసం ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని సీపీఎం కార్యా లయంలో నిర్వహించిన పార్టీ నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రం తీసుకు వచ్చిన లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించాలని కోరారు. సమా వేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, జిల్లా కార్యద ర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, డి.మల్లేశం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల తదితరులు పాల్గొన్నారు.