నీలగిరి, జనవరి 10 : నల్లగొండ మున్సిపల్ చైర్మన్పై సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు విప్ జారీ చేసినప్పటికీ దానికి విరుద్ధంగా ఓటింగ్లో పాల్గొన్నారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నల్లగొండ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి బుధవారం కలెక్టర్ హరిచందనకు వినతిపత్రం సమర్పించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమెను కలిసిన ఆయన జిల్లాకు నూతనంగా వచ్చినందుకు మర్యాద పూర్వకంగా పూల మొక్కను అందజేశారు. అనంతరం విప్ ధిక్కరించిన కౌన్సిలర్లను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి సొంత పార్టీ చైర్మన్పై జరిగిన అవిశ్వాస ఎన్నికల్లో డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. అందుకు సంబంధించిన అన్ని వివరాలను ఆయన కలెక్టర్కు అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణ చేసి ఎన్నికల కమిషన్కు నివేదిక సమర్పించి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.