రామగిరి, డిసెంబర్ 3 : ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ప్రజల మధ్య ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు అందరికీ అండగా ఉండి పనిచేస్తానని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలో ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడారు. నల్లగొండ అభివృద్ధి నిలిచిపోకుండా వేయి కండ్లతో కాపాడుకుంటూ ముం దుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
2014లో ఓటమి చెందిన వ్యక్తిని అని, అయినప్పటికీ తాను హైదరాబాద్కు పారిపోలేదన్నారు. ఆ రోజు నుంచి ఐదేండ్లు ప్రజల మధ్యలోనే ఉంటూ పనిచేసి, 2018లో గెలిచానన్నారు. రాబోయే కాలంలో మళ్లీ గెలిచి నల్లగొండను అభివృద్ధిలోకి తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాబోయే కాలంలో ప్రజల వెంటనే ఉండి పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలున్నారు.