రామగిరి: తెలంగాణలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో(యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సు)లో ప్రవేశానికి నిర్వహించే టిఎస్ పీఈసెట్-2021 (తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకే షన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని సెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ప్రొ. సీహెచ్. గోపాల్రెడ్డి వెల్లడించారు.
నల్లగొండలోని ఎంజీయూ ఆర్ట్స్ బ్లాక్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉ.7గం.నుంచి బ్యాచ్ల వారీగా జరిగే ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలకు ప్రారంభమవుతుండగా 5054 మంది హాజ రుకానున్నట్లు వెల్లడించారు. ఐదు సం.లుగా టీఎస్పీ ఈసెట్ను విజయవంతంగా నిర్వహిస్తు ఫలితాలను పరీక్షలు ముగిసిన రెండు, మూడు రోజుల్లోనే విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 14కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలతో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపా రు. ప్రతి అభ్యర్ధి విధిగా మాస్కులు ధరించి రావాల్సి ఉంటుంది. సమావేశంలో టీఎస్పీఈసెట్ కన్వీనర్ ప్రొ. వడ్డేపల్లి సత్య నారాయణ, ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ. పి.విష్ణుదేవ్, ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డా. జి.ఉపేందర్రెడ్డి, పీడీలు డా. వై.శ్రీనివాస్రెడ్డి, డా.ఆర్.మురళీలు పాల్గొన్నారు.