ఆదివారం సెలవు రోజు ఐనప్పటికీ ఆ అధికారి మాత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.రేషన్ తీసుకోవడానికి చివరిరోజు కావడంతో ఎన్ని రేషన్ దుకాణాలు తెరచి పెట్టారు.. ఎన్ని మూసి ఉన్నాయనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందకు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సుడి గాలి పర్యటన చేపట్టారు.
దేవరకొండ, కొండమల్లెపల్లి మండలాల గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో రేషన్ దుకాణాల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో రేషన్ దుకాణాల్లో మాచన రఘునందన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టాక్, టైమింగ్స్, ఇలా పలు విషయాలను నిశితంగా పరిశీలించారు. రేషన్ దుకాణాలపై నిరంతర నిఘా ఉంటుందని.. రేషన్ అక్రమాలను ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.