నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్14 (నమస్తే తెలంగాణ) : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ సంబురాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలంతా సందడి చేశారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో బుధవారం బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలంతా తరలివెళ్లారు. రాజశ్యామల యాగంతోపాటు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యాలయ ఓపెనింగ్, జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నాటి కంటే రెట్టింపు ఉత్సాహంతో దేశ రాజధాని వీధుల్లో నేతలు సందడి చేశారు. మంత్రి జగదీశ్రెడ్డితోపాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగానూ బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. కేక్లు కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.
దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుం బిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశ రాజధాని ఢిల్లీపై గురిపెట్టారు. ఇక నుంచి తెలంగాణ నమూనా అభివృద్ధి, సంక్షేమ ఎజెండాతో దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తూ తొలి అడుగుగా ఢిల్లీ కేంద్రంగా పార్టీ కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో బుధవారం అట్టహాసంగా నిర్వహించిన కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్యులంతా పాల్గొన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంతో మంగళవారం రాత్రే వీరంతా ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం ఆసాంతం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. పార్టీ కార్యాలయ ప్రారంభానికి ముందు నిర్వహించిన నవ చంఢీ హోమం, రాజశ్యామల యాగంతో పాటు పూర్ణాహుతిలో వీరంతా పాల్గొన్నారు.
మధ్యాహ్నం 12.37గంటలకు పార్టీ జెండావిష్కరణ కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. కార్యాలయ ప్రారంభంలోనూ పాల్గొంటూ అధినేత కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ను స్థాపించి తెలంగాణను సాధించి, అనతికాలంలోనే తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దిన మాదిరిగానే దేశంలో అభివృద్ధి పంథాను ముందుకు తీసుకుపోవడంతో కేసీఆర్ విజయవంతం కావాలంటూ ఆకాంక్షించారు. బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఇచ్చే ఏ పిలుపులోనైనా ఉమ్మడి నల్లగొండ జిల్లా తరుపున వెన్నంటి నడుస్తూ ముందుంటామని ఈ సందర్భంగా జిల్లా నేతలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
మంత్రి జగదీశ్రెడ్డితో పాటు ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నోముల భగత్కుమార్, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్కుమార్, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్, నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, పార్టీ రాష్ట్ర నేతలు చాడ కిషన్రెడ్డి, వంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగేంధర్రావు, గోపగాని వెంకట్నారాయణ, కేవీ.రామారావు, జిల్లా శంకర్, రంజిత్యాదవ్, చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, వై.వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధ్ది
ఆత్మకూర్.ఎస్, డిసెంబర్ 14 బీఆర్ఎస్తో దేశాభివృద్ధి సాధ్యపడుతుందని సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ అన్నారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ కార్యాలయ ప్రా రంభం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆత్మకూర్.ఎస్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, మార్కెట్ మాజీ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ జానయ్య పాల్గొన్నారు.
సూర్యాపేట ;సూర్యాపేట మండలం నుంచి ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి జడ్పీటీసీ జీడి భిక్షం తదితరులు నాయకులు పాల్గొన్నారు.
త్రిపురారం :త్రిపురారం మండలం నుంచి రాష్ట్ర గిరిజన సహకార, ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్, నాయకులు మర్ల చంద్రారెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు మేలు
ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా హుజూర్నగర్లో కార్మికులు కేక్ కట్ చేసి సంబురాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ ఆధ్వర్యంలో దేశంలో ఉన్న కార్మికులకు మేలు చేయడానికే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక నాయకులు మల్లయ్య, నాగేందర్, వెంకటేశ్వర్లు , నర్సింహారావు, ఉస్మాన్, మల్లేశ్, షరీఫ్, నాగులు ,నరేశ్, మురళి, లింగయ్య, శ్రీను, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు సైదులు, నర్సింహారావు పాల్గొన్నారు.