దేవరకొండ, డిసెంబర్ 12 : దేవరకొండ నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.105.12 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే రమావవాత్ రవీంద్రకుమార్ తెలిపారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి ఫేస్లో గిరిజన, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల నుంచి నిధులు మంజూరైనట్లు చెప్పారు. ఈ నిధులతో నియోజకవర్గంలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను బాగు చేయనున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్శాఖ ద్వారా 45.59 కోట్లు, రోడ్లు భవనాల శాఖద్వారా రూ. 29 కోట్లు, గిరిజనశాఖ నుంచి రూ.30.53 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పీఏపల్లి మండలానికి అధికంగా నిధులు మంజూరయ్యాయన్నారు. గతంలో ఏఎంఆర్పీ పరిధిలో నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉన్న రహదారులను పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసి వాటిని మరమ్మతులు చేనపట్టనున్నట్లు చెప్పారు. మరో విడుత కూడా 30 నుంచి 40 కోట్ల నిధులు మంజూరు కానున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో సుమారు 230 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. కొండమల్లేపల్లి నుంచి పాల్వాయి వరకు రూ.9 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభమైనట్లు చెప్పారు.
చింతపల్లి మండలం తిరుమలపురం గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేశ్గౌడ్, కొండమల్లేపల్లి జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగేందర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, ముత్యాల సర్వయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, రాజినేని వెంకటేశ్వర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్అలీ, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, నాయకులు భాస్కర్రెడ్డి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, పాల్గొన్నారు.
అభివృద్ధి పథంలో పల్లెలు
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని, ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ‘మన ఊరు- మన ప్రభుత్వం – మన పథకాలు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నేరేడుగొమ్ము మండలంలోని చిన్నమునిగల్ గ్రామంలో రూ.20 లక్షలతో, వైజాక్ కాలనీ గ్రామంలో రూ.20 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబా భవానీ, కంబాలపల్లి, పొగిళ్ల లిఫ్టులతో నేరేడుగొమ్ము, చందంపేట మండలాల్లోని సాగు భూములు సస్యశామలం అవుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాణావత్ పద్మాహన్మానాయక్, జడ్పీటీసీ కేతావత్ బాలు, పీఏసీఎస్ చైర్మన్ ముక్కమల బాలయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, వైస్ ఎంపీపీ ఆరెకంటి రాములు, ఎంపీటీసీ వాంకుణావత్ బిక్కు, సర్పంచులు దూడ బావోజీ, కేతావత్ జంకు సోమ్లానాయక్, వడ్త్య బాలు, పల్స వెంకటయ్య, బైరెడ్డి కొండల్రెడ్డి, పాషా, లావుడ్య రమేశ్, ముక్కమల సాయన్న, వాంకుణావత్ నాగూనాయక్, భరత్, చెన్నానాయక్, దేవుడు, లచ్చన్న, అధికారులు పాల్గొన్నారు.