నీలగిరి,నవంబర్ 26 : తబ్లిక్ జమాత్ ఆధ్వర్యంలో ఈనెల 29,30 తేదీల్లో పట్టణంలో నిర్వహించనున్న ఇస్తేమాకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మున్సిపల్ అధికారులను సూచించారు. శనివారం పట్టణం లోని ఈద్గా వద్ద ఇస్తేమా ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. కరోనా తరువాత మొదటిసారిగా జరుగుతున్న ఇస్తేమాకు సుమారు 30 వేలకుపైగా ముస్లీంలు హాజరవుతారని, రెండు రోజులపాటు ఇక్కడే ఉంటారని తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. మంచినీరు, లైటింగ్, శానిటేషన్, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై పలు సూచనలు చేశారు.
ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, డీఎస్పీ నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యుశ్రీనివాస్, కౌన్సిలర్ శ్రీనివాస్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్, బషీరుద్దీన్, పుర్కానా, అబ్దుల్ రజాక్, కోఅప్షన్ సభ్యుడు సోహెల్, తబ్లిక్ జమాత్ మౌలానాలు, ఇమామ్లు ఉన్నారు.
మైనార్టీ గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే
నల్లగొండ : మైనార్టీ గురుకుల పాఠశాల అభివృ ద్ధికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఆయన శనివారం పట్టణంలోని మైనార్టీ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కళాశాలలో ప్రహరీ గోడ నిర్మాణంతోపాటు భవన నిర్మాణా నికి ప్రత్యేక నిధులు అందిస్తానని అన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఎమ్మెల్యే మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
నష్టపరిహారం చెక్కు అందజేత
నల్లగొండ రూరల్ : మండలంలోని పెద్ద సూరారం గ్రామానికి చెందిన బాత్క సైదులు ఎద్దు ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందింది. శనివారం విద్యుత్ శాఖ నుంచి పరిహారంగా మంజూరైన రూ. 40 వేల చెక్కును ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తన నివాసంలో బాధితుడికి అందజేశారు. టీఆర్ఏస్ మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డి, సర్పంచ్ రమాదేవీజయపాల్రెడ్డి, కృష్ణ, విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు.