రామగిరి, నవంబర్ 24: సమాజంలో ఓటు విలువైందని 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని నల్లగొండ ఆర్డీఓ చంద్రశేఖర్రెడ్డి సూచించారు. నల్లగొండలోని నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ‘ఓటహక్కు- ఓటరు నమోదు’పై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నిజాయితీగా ఓటు వేయాలన్నారు. ఈ విషయంలో యువత మేల్కోని ప్రజలను చైతన్యం చేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మారం నాగేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నల్లగొండ తాసీల్దార్ మందడి నాగార్జునరెడ్డి, కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారులు అశోక్, మహేందర్ , అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు
విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సైదులు హెచ్చరించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నీలగిరి జూనియర్, డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గురువారం యాంటీ ర్యాగింగ్ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు లక్ష్య సాధనకోసం ముందుకు సాగి జీవితంలో స్థిరపడాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ కె.దీపిక, కళాశాల ప్రిన్సిపాల్ మారం నాగేందర్రెడ్డి పాల్గొన్నారు.