తుర్కపల్లి, నవంబర్22 : ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ అన్నారు. సీఎం సహాయ నిధి నుంచి మండలంలోని మోతీరాంతండాకు చెందిన ధరావత్ రాజేశ్కు రూ.60 వేలు, బానోతు శ్రీనుకు రూ.36 వేలు, ధరావత్ ప్రశాంత్కు రూ.27,500 మంజూరయ్యాయి. చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు ఎంపీపీ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్నాయక్, బాలూనాయక్, శ్రీను, భీమ్సింగ్, లక్పతి పాల్గొన్నారు.
ఆలేరు : ఆలేరు మున్సిపాలిటీలోని ఆరో వార్డుకు చెందిన ఎం.శ్రీకాంత్కు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.60 వేల చెక్కును కౌన్సిలర్ రాయపురం నర్సింహులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి పేదలకు వరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండలంలోని మొరిపిరాల గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నగూడేనికి చెందిన మల్లెపూల కల్పనకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.36 వేల చెక్కును సర్పంచ్ సామ తిరుమల్రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని వర్గాల పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బెజ్జరబోయిన మహేశ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మల దశరథ, పన్నాల మల్లారెడ్డి, సత్తిరెడ్డి, మల్లేశ్, రాజు, దామోదర్, సతీశ్, మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు.
గుండాల : మండలంలోని వెల్మజాల గ్రామానికి చెందిన ఊడ్గుల శంకరయ్యకు రూ.19,500, సంగి లచ్చయ్యకు రూ.60 వేలు సీఎం సహాయ నిధి నుంచి మంజూరయ్యాయి. సదరు చెక్కులను మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్యాదవ్, సర్పంచ్ సంగి బాలకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సింగారం పాండు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సంగి బాలకొమురయ్య, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు కొమ్మగళ్ల దయాకర్, నాయకులు మత్స్యగిరి, మధు, రాము, బాలయ్య పాల్గొన్నారు.
మోటకొండూర్ : మండలంలోని ముత్తిరెడ్డిగూడేనికి చెందిన కడమంచి సోమయ్యకు రూ.55 వేలు, కల్లెం శారదకు రూ.45 వేలు సీఎం సహాయ నిధి నుంచి మంజూరయ్యాయి. సదరు చెక్కులను గ్రామ సర్పంచ్ ఆడెపు విజయ మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెగాని వెంకటేశ్, నాయకులు గుర్రాల రవి, గంధమల్ల పాండు, గంగరబోయిన రమేశ్, పన్నీరు భరత్, కంతుల శేఖర్, కడమంచి బాలనర్సింహ, ఆడెపు మహేశ్ పాల్గొన్నారు.