భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 21 : ప్రజావాణిలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా 36 ఫిర్యాదులు స్వీకరించామని, ఇందులో రెవెన్యూశాఖకు సంబంధించినవి 31, జిల్లా ఉపాధి కల్పన శాఖ, మత్స్యశాఖ, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ, భువనగిరి మున్సిపాలిటీలకు సంబంధించిన ఒక్కో ఫిర్యాదు అందినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దీపక్తివారీ, డి. శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీఓ మందడి ఉపేందర్రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వరాచారి పాల్గొన్నారు.
భూదాన్పోచంపల్లి : స్థానిక బసవ లింగేశ్వర కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ కాలనీ ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్ పమేలాసత్పతికి వినతిపత్రం అందించారు. కాలనీ నుంచి ఏనుగువారిగూడెం మీదుగా పోచంపల్లికి వెళ్లేందుకు బ్రిడ్జి నిర్మించాలని కోరారు. నాయకులు కర్నాటి పురుషోత్తం, గుండు సత్యనారాయణ, నరసింహస్వామి, వేముల ఏలేంధర్ పాల్గొన్నారు.
బీబీనగర్ : మండల కేంద్రంలోని రంగాపురం గ్రామ ఆవరణలో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయంలో దైవ దర్శనానికి భక్తులకు అనుమతించాలని కోరుతూ అయ్యప్ప సేవా సమితి, భక్తాంజనేయ సేవా సమితి సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందించారు. సర్వే నంబర్ 73/ఆ లో ఆలయం ఉన్నదని, కొన్ని రోజులుగా బీబీనగర్ ఎయిమ్స్ సిబ్బంది ఆలయం ఉన్న భూమికి ఫెన్సింగ్ వేశారని, భక్తులను రానివ్వడం లేదని తెలిపారు. సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో వినియోగదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంజాల సురేశ్గౌడ్, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు శుక్లంచారి, భక్తాంజనేయ స్వామి సభ్యులు తుమ్మల నర్సింహారెడ్డి, వన్నాల రమేశ్, దేవరుప్పల శ్రీధర్ పాల్గొన్నారు.