త్రిపురారం, ఫిబ్రవరి 18 : కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో 54మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00, 116 విలువైన చెక్కులను వారి ఇళ్లకు వెళ్లి శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ నిరుపేదల కష్టం తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెద్దన్నగా ప్రభుత్వం తరపున రూ.లక్ష అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అంతేగాక కేసీఆర్ కిట్, ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించడానికి 110 వాహనాలు అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. ఆడపిల్లలకు ప్రత్యేకమైన కస్తూర్బా, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచంద్రనాయక్, మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ జయరాంనాయక్, ప్రధాన కార్యదర్శులు వనజ, వెంకటాచారి, నాయకులు మర్ల చంద్రారెడ్డి, రామచంద్రయ్య, కామెర్ల జానయ్య, పెద్దబోయిన శ్రీనివాస్, మడుపు వెంకటేశ్వర్లు, అనంతరెడ్డి, భరత్రెడ్డి, జంగిలి శ్రీను, దస్తగిరి, శిరసవాడ పెద వెంకటయ్య, వివిధ గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.
లబ్ధిదారులి బాబుకు భగత్ పేరు నామకరణం
మండలంలోని అంజనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పాల్తితండా గ్రామానికి చెందిన కొడావత్ ప్రతాప్నాయక్ కుమార్తె స్వాతికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కు అందించడానికి ఎమ్మెల్యే భగత్ వారి ఇంటికి వెళ్లారు. అప్పటికి ఆమెకు డెలివరీ అయి నాలుగు రోజులవుతుండగా కల్యాణ లక్ష్మి చెక్కు అందించినందుకు కృతజ్ఞతగా కుమారుడి పేరు ఇస్లావత్ భగత్కుమార్గా నామకరణం చేశారు.
పీహెచ్సీ సబ్ సెంటర్కు భూమిపూజ
త్రిపురారం మండలంలోని మాటూరు గ్రామం లో పీహెచ్సీ సబ్ సెంటర్కు ఎమ్మెల్యే భగత్ శుక్రవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సీహెచ్వో తావునాయక్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచంద్రనాయక్, పార్టీ మండలాధ్యక్షులు బహునూతల నరేందర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.