భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 9: మండలంలోని తాజ్పూర్ గ్రామ సమీపంలోని చిన్నేరు ఒడ్డుపై వెలసిన త్రిలింగేశ్వర ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా జరి గాయి. రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాల్రాజ్యాదవ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సతీమణి పైళ్ల వనిత పాల్గొని పూజలు నిర్వహించారు. త్రిలింగేశ్వరాలయం మహిమాన్వితమైనదని, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువని పేర్కొన్నారు. సామూహిక సత్యనారాయణ వ్రత పూజల్లో పైళ్ల వనిత పాల్గొన్నారు.
భక్తులంతా వాగులో పుణ్య స్నానమాచరించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదా నం చేపట్టారు. తాజ్పూర్ సర్పంచ్ మావురపు సురేశ్, ఉపసర్పంచ్ ర్యాకల సంతోషాశ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, మార్కెట్ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మధుసూధన్రెడ్డి, అబ్బగాని వెంకట్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, నాయకులు నీల ఓంప్రకాశ్గౌడ్, కేశవపట్నం రమేశ్, రమాదేవి, సర్పంచ్లు కవితారాఘవేందర్రెడ్డి, మల్లికార్జున్, పీర్జాదిగూడ కార్పొరేటర్ కౌడే పోచయ్య, వార్డుసభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.