చౌటుప్పల్, అక్టోబర్10 : మునుగోడు ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే కాంట్రాక్టు కోసం బీజేపీ వద్ద అమ్ముడు పోయి ఉప ఎన్నిక తీసుకొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇప్పుడు డ్రామాలాడుతున్నాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్గౌడ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు సోమవారం టీఆర్ఎస్లో చేరారు.
స్థానిక పీబీ గార్డెన్స్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు వర్కాల వెంకటేశం, బాలమణి, యాద య్య, భాగ్యమ్మ, శ్రీశైలం, బాలకృష్ణ, జ్యోతి, వెంకటేశం, పారిజాత ఉన్నారు. 5వ వార్డు ఇన్చార్జి కొయ్యడ శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు ముటుకుల్లోజు దయాకరాచారి, ఎండీ అస్లాంఖాన్, రాగీరు సత్యనారాయణ, నిమ్మల అచ్చయ్య, గట్టు రామచంద్రం, బండి వెంకటేశం పాల్గొన్నారు.