చండూరు(గట్టుప్పల్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం గట్టుప్పల మండలంలోని వివిధ పార్టీలకు చెందిన 300 యువత ఎమ్మెల్యే చిరుమర్తి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
త్వరలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించి మునుగోడు అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండారు చంద్రయ్య, టీఆర్ఎస్ నాయకులు ఇడెం కైలాసం, గోపగాని వెంకటనారాయణగౌడ్, ఎంపీటీసీ గోరిగె సత్తయ్య, పురుషోత్తం, బీమగాని మహేశ్గౌడ్, బొడిగె వెంకటేశ్, చెరుపల్లి కృష్ణ, ఇడెం గణేశ్, రాఘవేందర్, శ్రీను, వెంకటేశ్ ఉన్నారు.