మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
మర్రిగూడ, సెప్టెంబర్ 23 : అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్గా దూసుకుపోతున్న రాష్ట్రంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి బీజేపీ ఓర్వలేకపోతున్నదని విమర్శించారు. మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన 11మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్పంచ్ మాడెం శాంతమ్మావెంకటయ్య ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో శుక్రవారం హైదరాబాద్లో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కొనుగోలు చేసి ఉద్దేశ పూర్వకంగా మునుగోడు ఉప ఎన్నిక తెస్తున్న బీజేపీకి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. తెలంగాణపై బీజేపీ చేస్తున్న దండయాత్రను జయించడానికి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్తో కలిసిరావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల అమలుకు టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని స్పష్టంచేశారు.
మర్రిగూడ : రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిన మోసకారి బీజేపీని తరిమికొట్టాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రజలను కోరారు. మండలంలోని లెంకలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు కొప్పుల యాదమ్మ, అబ్బనబోయిన నరేశ్, కందికంటి వెంకమ్మతోపాటు నాయకులు కె.నారాయణ్రెడ్డి, సైదులు.. సర్పంచ్ పాక నగేశ్యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా యరగండ్లపల్లి గ్రామానికి చెందిన 15 కాంగ్రెస్, బీజేపీ కుటుంబాలు మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరాయి. వారికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మా ట్లాడుతూ బీజేపీ వంచనకు, టీఆర్ఎస్ ఆత్మగౌరవానికి మధ్య మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ముద్దం శ్రీనివాస్గౌడ్, నాయకులు వల్లంల సంతోష్యాదవ్, వనపర్తి వెంకటయ్య, మెరుగు మురళి పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన బంగారిగడ్డ గ్రామస్తులు
చండూరు : మండల పరిధిలోని బంగారిగడ్డకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం టీఆర్ఎస్లో చేరారు. చేరినవారిలో గాలెంక దేవదాసు, శోభ, పద్మ, బొల్లెం భాస్కర్, బాక్కారం మారయ్య, సుంకరి యాదయ్య, వంశీతోపాటు మరో 10మంది ఉన్నారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సుంకరి యాదయ్యగౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు సుంకరి సత్తయ్య, బోయపల్లి దశరథ, పల్లె శ్రీను, రొమ్ముల పరమేశ్, సుంకరి శివ, రమేశ్, రాజు పాల్గొన్నారు.