దేవరకొండ, సెప్టెంబర్ 23 : విద్యతోనే దేశ స్థాయికి ఎదగవచ్చని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్రెడ్డి జ్ఞాపకార్థం ఎమ్మెల్సీ నిధులు రూ. 80లక్షలతో స్థానిక బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ విద్యార్థులు పోటీ పరీక్షలకు గ్రంథాలయం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.
ఎంపీ కేశవరావు మాట్లాడుతూ జైపాల్రెడ్డితో విద్యార్థి దశ నుంచి స్నేహం ఉందని గుర్తుచేశారు. తన రాజ్యసభ నిధుల నుంచి మూడు గ్రంథాలయాలకు నిధులు ఇస్తానని ఎక్కడ నిర్మించి గుర్తించి తన వద్దకు రావాలని చెప్పారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ పట్టణంలో గ్రంథాలయ భవనం లేక యువత పలుమార్లు తన దృష్టికి తేగా మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి సహకారంతో నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం జైపాల్రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి గ్రంథాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, జిల్లా గ్రంథాలయం చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మ =న్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, ఎంపీపీలు నల్లగాసు జాన్యాదవ్, వంగాల ప్రతాప్రెడ్డి, మాధవం సునీతాజనార్దన్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ దేవేందర్నాయక్, జైపాల్రెడ్డి కుటుంబసభ్యులు, టీఆర్ఎస్ నాయకులు టీవీఎన్రెడ్డి, సుధీర్రెడ్డి, వెంకటేశ్గౌడ్, వెంకటేశ్వ ర్లు, కృష్ణయ్య, జిల్లా గ్రంథాలయ అధికారి బాలమణి, కౌన్సిలర్లు రైస్, జయప్రకాశ్నారాయణ, ప్రదీప్, ఇలియాస్, సైదులు పాల్గొన్నారు.