మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి4 : నమ్మిన సిద్ధాంతానికి విలువనిచ్చి జీవితాంతం కట్టుబడిన గొప్ప వ్యక్తి తిరునగరు గంగాధర్ అని పలువురు నాయకులు కొనియాడారు. గంగాధర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డితో కలిసి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే భాస్కర్రావు పాల్గొని మాట్లాడారు. గంగాధర్తో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, అనుకున్నది చేయాలన్నదే ఆయన నైజం అని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని చెప్పేవారని, క్రమశిక్షణ కల్గిన గొప్ప వ్యక్తిగా జిల్లా రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్నాడని కొనియాడారు. మిర్యాలగూడ పట్టణాభివృద్ధిలో అయన కృషి అపారమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, భారతీ రాగ్యానాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, ఎన్బీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు నల్లమోతు సిద్ధార్థ, నాయకులు స్కైలాబ్నాయక్, సీడీ రవికుమార్, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మెరుగు రోశయ్య, తిరునగరు నాగలక్ష్మి, సాజిద్ ఖాన్, మోసిన్ అలీ, తాళ్లపల్లి రవి, ఉదయ భాస్కర్, అమృతం సత్యం, నవాబ్ పాల్గొన్నారు.