నందికొండ, సెప్టెంబర్ 8 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్టు 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థా యి నీటి మట్టం 590(312 టీఎంసీ) అడుగులకు 589.00 (309.0570 టీఎంసీ) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్కు 4,35, 157 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా ప్రాజెక్టు 22 క్రస్ట్ గేట్ల ద్వారా 3,52,818 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. కుడికాల్వ ద్వారా 9,833 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేం ద్రం ద్వారా 32,886, ఎస్ఎల్బీసీ ద్వారా 1,8 00 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నది. ఎడమ కాల్వ ఎల్ఎల్బీసీలకు నీటి విడుదల లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 3, 97,337 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయికి 885 అడుగులకు 884.40(211.9572 టీఎంసీ) మేర నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్కు 4,38, 983 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది.