మాల్, జనవరి 24 : భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. గొట్టిముక్కల రిజర్వాయర్ కింద భూములు, ఇళ్లు కోల్పోయిన రైతులకు చింతపల్లి గేట్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్అండ్ఆర్ సెంటర్లో రూ.2.76కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీ, వాటర్ ట్యాంకు, అంగన్వాడీ భవనానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొట్టిముక్కల రిజర్వాయర్ కింద ముంపునకు గురైన కుటుంబాలకు ఆర్అండ్ఆర్లో అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి ఎకరాకూ సాగు నీరందించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఇప్పటికే గొట్టిముక్కల రిజర్వాయర్ పనులు 95శాతం పూర్తయినట్లు తెలిపారు. డిండి, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో ఎక్కువ రిజర్వాయర్లు ఉన్న నియోజకవర్గం అవుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్, చింతపల్లి జడ్పీటీసీ కంకణాల ప్రవీణా వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు విద్యాసాగర్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోపిరెడ్డి కృష్ణారెడ్డి, రవి, మహిళా విభాగం అధ్యక్షురాలు సుమతీరెడ్డి, అశోక్, గోపాల్గౌడ్, కిరణ్కుమార్రెడ్డి, అక్రంయాదవ్, శ్రీశైలం, మల్లేశ్రెడ్డి, శ్రీను యాదవ్, జగన్నాయక్, ఎండీ.ఖాలేద్, కృష్ణ, ఎంపీడీఓ రాజు, ఇన్చార్జి డీఈ జీవన్సింగ్ పాల్గొన్నారు.
చంద్రన్న ఆశయ సాధనకు కృషి చేద్దాం
దేవరకొండ : ఎల్లప్పుడూ పేదల కోసం పనిచేసిన చంద్రన్న ఆశయ సాధనకు కృషి చేద్దామని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. హన్మంత్ చంద్రన్న వర్ధంతి సందర్భంగా పట్టణంలో సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మిక, కర్షక నేత చంద్రన్న అని కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటమ్మకు రూ.20వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, జడ్పీటీసీ కంకణాల ప్రవీణావెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, వైస్ చైర్మన్ రహత్ అలీ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, లోకసాని తిరుపతయ్య, రాజినేని వెంకటేశ్వర్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్నాయక్, నేనావత్ వశ్యానాయక్, బొడ్డుపల్లి కృష్ణ, సైదులు, జయప్రకాశ్, గోపాల్రావు, చంద్రన్న ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్గౌడ్, రాఘవేందర్గౌడ్, హనత్ సాయి, దేవయ్య పాల్గొన్నారు.
క్రిస్టియన్లకు అండగా ప్రభుత్వం
ప్రభుత్వం క్రిస్టియన్లను అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని ఐదో వార్డులో చర్చి నిర్మాణ పనులకు సోమవారం చేపట్టిన భూమిపూజలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తుందన్నారు. చర్చి నిర్మాణ పనులకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, వైస్ చైర్మన్ రహత్ అలీ, మున్సిపల్ మాజీ చైర్మన్ వ్యడ్త దేవేందర్నాయక్, బొడ్డుపల్లి కృష్ణ, ప్లాస్టర్లు పాల్గొన్నారు.