కొండమల్లేపల్లి, జనవరి 24 : కొండమల్లేపల్లి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఉదయ మాట్లాడుతూ బాలికలను చదువులో ప్రోత్సహించాలన్నారు. కిశోర బాలికలకు ఆరోగ్యపరమైన సూచనలు అందించారు. కార్యక్రమంలో ఏసీడీపీఓ సరళ, సూపర్వైజర్లు మంజుల, చట్టెమ్మ, జ్యోతి, మానిక్యమ్మ, మేరి, కిశోర బాలికలు పాల్గొన్నారు.
నిడమనూరు : సమాజంలో ఆడపిల్లల రక్షణ అందరి బాధ్యత అని ముకుందాపురం అంగన్వాడీ టీచర్ అంబటి మణెమ్మ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని ముకుందాపురం గ్రామంలో భేటీ బచావో-భేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష, బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం బాలికల రక్షణకు పాటు పడతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ముకుందాపురం సర్పంచ్ కేశ శంకర్, ఎంపీటీసీ మంజుల శ్రీనివాస్, కోఆప్షన్ మండల సభ్యుడు షేక్ సలీం, అంగన్వాడీ టీచర్ అరుణ, ఏఎన్ఎంలు సుచిత్ర, సుగుణ, రమణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.