రామగిరి, జనవరి 23 : బ్రాహ్మణుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ధూప, దీప నైవేద్య, అర్చక సమాఖ్య(డీడీఎన్ఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్, జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పెన్నా మోహన్శర్మ ఆధ్వర్యంలో నల్లగొండలోని శివాజీనగర్లో గల టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన శ్రీశుభకృత్ నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మతో కలిసి పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రాహ్మణ, అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపేలా వారికోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణులకు తగిన గౌవరం ఇస్తున్న సీఎం కేసీఆర్.. దేశంలో ఆధ్యాత్మిక కేంద్రం, తెలంగాణ తిరుపతిగా యాదగిరి గుట్టను తీర్చి దిద్దుతున్నారని పేర్కొన్నారు. ఇది హిందూ సమాజంపై, బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్కు ఉన్న దక్షతకు నిదర్శనమన్నారు. గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు ధూప, దీప నైవేద్య పథకంతో నిధులు అందించి అర్చకులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారన్నారు. రాష్ట్రంలోని 3600 దేవాలయాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరో 2800 ఆలయాలు ఈ పథకం కిందికి రానున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, కౌన్సిలర్ యామ కవితాదయాకర్, వరంగల్ కాజీపేటకు చెందిన సిద్ధాంతి అనంత మల్లయ్యశాస్త్రి, దర్వేశిపురం దేవస్థానం ప్రధానార్చకుడు నాగోజు మల్లాచారి, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండోజు నవీన్కుమార్, అర్చక జేఏసీ నాయకులు చిలకమర్రి శ్రవణ్కుమారాచార్యులు, వట్టిపల్లి సత్యనారాణశర్మ, మేడారం నర్సింహాచారి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్, నాయకులు కటకం సత్తయ్యగౌడ్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన బ్రాహ్మణులు పాల్గొన్నారు.