నీలగిరి, జూన్ 28 : అమెరికాలో నల్లజాతి వారితో హత్యకు గురైన నక్కా సాయిచరణ్ అంత్యక్రియలు మంగళవారం జిల్లా కేంద్రంలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ఈనెల 19న కారులో వెళ్తుండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. అయితే పదిరోజుల తరువాత మంగళవారం ఉదయం నల్లగొండకు ఆయన మృతదేహం తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాన్ని రెండు గంటల పాటు స్నేహితుల, బంధువుల సందర్శనార్ధం వివేకనందనగర్లోని సాయిచరణ్లో స్వగృహంలో ఉంచారు. కుటుంబ సభ్యు లు, బంధువులు బోరునా విలపించడం తో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం జరిగిన అంతిమయాత్రలో జిల్లాలోని పలువురు ప్రముఖులు, పట్టణ, కాలనీవాసులు పాల్గొన్నా రు. తండ్రి నర్సింహ ముందు నడువగా, సాయి చరణ్ పాడెను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మోశారు.
ప్రముఖుల నివాళి
వివేకానందనగర్ నుంచి హైదరాబాద్ రోడ్డులో శ్మశానవాటిక వరకు అశేష జనవాహిని నడుమ సాయిచరణ్ అంతిమ యాత్ర కొనసాగింది. నల్లగొండ, భువనగిరి ఎంపీలు నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్నాటి విద్యాసాగర్, ఎంపీపీ మనిమిద్దె సుమన్, వివిధ పార్టీల నాయకులు పాల్గొని సాయిచరణ్కు నివాళులర్పించారు.