రామగిరి, జూన్ 28 : చర్లపల్లి బైపాస్ సమీపంలోని అనేశ్వరమ్మ గుట్టను కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిజీ మంగళవారం సందర్శించారు. స్వామీజీకి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేతో కలిసి స్వామీజీ గుట్ట పరిసర ప్రాంతాలను, గోశాలను పరిశీలించారు. ఎమ్మెల్యే స్వామీజీకి గుట్ట ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో అద్భుతమైన టెంపుల్ సిటీని తీర్చిదిద్దేందుకు అనేశ్వరమ్మ గుట్ట అనుకూలంగా ఉందన్నారు. అద్భుతమైన వాస్తు, ఈశాన్యంలో పానగల్ రిజర్వాయర్ ఉన్నందున ఈ ప్రాంతం ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, పట్టణ ప్రజల సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం స్వామీజీ కట్టంగూర్ రోడ్డులో ఉన్న శంకర గోశాల, ప్రహ్లాద లక్ష్మీనరసింహ ఆలయాన్ని సందర్శించారు. స్వామీజీ వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్, జెర్రిపోతుల భాస్కర్గౌడ్, గున్రెడ్డి యుగంధర్రెడ్డి, గోవింద్రెడ్డి, బీపంగి కిరణ్, బొజ్జ వెంకన్న, మర్రి శ్రీను ఉన్నారు.
శంకరమఠం ఏర్పాటుకు భూమిపూజ
నార్కట్పల్లి : మండలంలోని గోపలాయపల్లి వారిజాల వేణుగోపాల స్వామి క్షేత్రాన్ని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ మంగళవారం సందర్శించారు. గుట్ట కింద శంకరమఠం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గుట్టపై శిల్ప శాస్త్ర కళాశాల ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. ఆలయ అనువంశిక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్రెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. గోపలాయపల్లి గుట్టపై వాతావరణం అద్భుతంగా ఉందని, రానున్న కాలంలో ఈ క్షేత్రం దివ్యక్షేత్రంగా వెలుగొంది భక్తులకు వరంగా మారుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సర్పంచులు స్రవంతి, భధ్రాచలం పాల్గొన్నారు.