కట్టంగూర్, మార్చి 17 : అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని రామచంద్రాపురం, మల్లారం గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు గురువారం శంకుస్థాపన చేసి అనంతరం 129 మందికి మంజూరైన సుమారు. రూ.1.30 కోట్ల విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కట్టంగూర్లో పంపిణీ చేసి మాట్లాడారు. దేశంలో ఎక్కాడా లేని పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకున్న నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. నిరుపేదలకు చేయూతనిచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, తాసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, సర్పంచులు వడ్డె సైదిరెడ్డి, పుట్ట సుజనావెంకట్రెడ్డి, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, ప్రియాంక, దాసరి సంజయ్కుమార్, బోడ సరితాయాదగిరి, పూలమ్మ, పరశురాములు, ఉప సర్పంచ్ అంతటి శ్రీను, ఎంపీటీసీలు పాలడుగు హరికృష్ణ, వల్లపు నాగలక్ష్మి, బీరెల్లి రాజ్యలక్ష్మీప్రసాద్, భవాని, జానీపాషా, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, నాయకులు ఊట్కూరి శంకర్, చౌగోని నాగరాజు నకిరేకంటి నర్సింహ, గాజుల బుచ్చమ్మ, కరిమిల్ల మల్లేశ్, పాల్గొన్నారు.