కట్టంగూర్, ఆగస్టు 18 : పేదింటి కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం కట్టంగూర్లోని పీఆర్ఆర్ ఫంక్షన్హాల్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 157 మందికి మంజూరైన రూ.కోటి విలువ గల కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెప్పలేనన్ని సంక్షేమ పథకాలకు ప్రవేశపెట్టి నిరుపేదలను ఆదుకున్నాడని తెలిపారు.
అనంతరం ఉన్నత పాఠశాలలో స్వతంత్ర వజ్రోత్సవాల క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో తాసీల్దార్ జి.దేశ్యానాయక్, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, జడ్పీటీసీ తరాల బలరాములు, ఎంఈఓ మేక నాగయ్య, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పాలడుగు హరికృష్ణ, సర్పంచులు పనస సైదులు, వడ్డె సైదిరెడ్డి, పరశురాములు, కట్టంగూర్ ఉప సర్పంచ్ అంతటి శ్రీను, ఎంపీటీసీలు బీరెల్లి రాజ్యలక్ష్మీప్రసాద్, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, మల్లెబోయిన శ్రీలతాకృష్ణ, నకిరేకల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, కోఆప్షన్ సభ్యుడు జానీపాషా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, మహిళ నాయకురాలు గాజుల బుచ్చమ్మ పాల్గొన్నారు.