రాజాపేట, జూన్ 30 : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మల్లెగూడెంలో రూ.1.20 కోట్లు, రేణికుంట నుంచి చల్లూరుకు రూ.1.50కోట్లతో బీటీ రోడ్డు పనులతో పాటు, రేణికుంటలో క్రీడా మైదానాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలు వెనుకబాటుకు గురయ్యాయని, ప్రస్తుత టీఆర్ఎస్ పాలనలోనే పల్లెలు ప్రగతి వైపు పయనిస్తున్నాయని తెలిపారు. మారుమూల పల్లె మల్లెగూడేనికి బీటీ రోడ్డు పనులు ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడుగు రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ జెన్నపల్లి ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన రాజు, నాయకులు ఎండీ.కరీం, జెన్నపల్లి లక్ష్మారెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దాత ఎంపీటీసీ నరేశ్రెడ్డి మూడేండ్ల గౌరవ వేతనంతో డెస్కు బెంచీలు అందించడం అభినందనీయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పాముకుంట ప్రాథమిక పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు చింద నర్సమ్మ, బూర్గు భాగ్మమ్మ, గుంటి మధుసూదన్రెడ్డి, ఠాకూర్ ధర్మేందర్సింగ్, నాగిర్తి గోపిరెడ్డి, కర్ల కర్ణాకర్రెడ్డి, వస్పరి విష్ణు పాల్గొన్నారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 19మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి గురువారం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
కాళేశ్వరం జలాలతో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధితో ఉందని, ప్రతి ఎకరాకు సాగు నీరందించే దిశగా అంచెలంచెలుగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ సందిల భాస్కర్గౌడ్, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, వైస్ ఎంపీపీ కాయితీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు పల్లె సంతోష్గౌడ్, మండల కోశాధికారి కటకం స్వామి, డైరెక్లర్లు అర్కాల గాల్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, కృష్ణ, రాంరెడ్డి, ఉపేందర్, వెంకటేశ్గౌడ్, జశ్వంత్, తిరుమలేశ్, సిద్దులు పాల్గొన్నారు.