పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి వార్షిక ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. జిల్లావ్యాప్తంగా బాలికలు 95.22 శాతం, బాలురు 92.05 శాతం ఉత్తీర్ణత సాధించారు. కొవిడ్ నేపథ్యంలో రెండేండ్లపాటు పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ పాస్ చేయగా, 2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా నల్లగొండ జిల్లా 14వ స్థానంలో నిలిచింది. గురుకుల, కస్తూర్బా పాఠశాలల విద్యార్థులు ఫలితాల్లో హవా సాగించారు.
రామగిరి, జూన్ 30 : కొవిడ్ నేపథ్యంలో రెండేండ్లుగా పరీక్షలు లేకుండానే పదోతరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణత చేసిన విషయం విదితమే. రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా 93.57 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా రాష్ట్రం లో జిల్లాకు 14వ స్థానం దక్కింది.2019లో 11వ స్థానం ఉండగా ఈ పర్యాయం మూడు స్థానాలు తగ్గింది. ఈ విద్యాసంవత్సరం మే-2022లో పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 19,747 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 18, 477లో ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 10,273 బాలురు ఉండగా 9,456 పాసయ్యారు.9,474 మంది బాలికలుండగా 9,021మంది ఉత్తీర్ణులయ్యారు. అన్ని పాఠశాల ఫలితాల్లో బాలికలే ముందంజలో ఉన్నారు.
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని 167 పాఠశాలలు ఉండగా 8 పాఠశాలల్లో 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ బాలాజీ నాయక్ తెలిపారు. టౌన్లో బాలిక పాఠశాల ఇంగ్లిష్ మీడియం, శాబ్నగర్ ఉర్దూమీడియం, సెయింట్మేరి ఎయిడెడ్ పాఠశాల, ఆలగడప ఇంగ్లిష్ మీడియం, ఊట్లపల్లి హైస్కూల్, తడకమళ్ల హైస్కూల్ , జడ్పీహెచ్ఎస్ అన్నారం, నందిపహాడ్ల్లో వంద శాతం మంది విద్యార్దులు ఉత్తీర్ణత సాధించారు. బకల్వాడ హైస్కూల్(ఈఎం)లో విద్యాజ్యోతి బాలిక 10 జీపీఏ పొందారు. యాద్గార్పల్లి హైస్కూల్లో శిరీష(ఈఎం)9.8, తుంగపహాడ్ మోడల్ స్కూల్లో ముగ్గురు విద్యార్దులు హరీశ్ కుమార్, నవీన్, కీర్తిశ్రీ 9.8 జీపీఏ ,బాలిక పాఠశాలలో పూర్ణిమ(ఈఎం) 9.8 సాధించినట్లు తెలిపారు.
వేములపల్లి: పదో తరగతి ఫలితాల్లో మండలంలోని ఏడు పాఠశాలల్లో 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 234 మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించారని ఎంఈఓ బాలాజీ నాయక్ తెలిపారు. ఆమనగల్ ప్రభుత్వ పాఠశాలలో 100 శాతం విద్యార్థ్ధులు ఉతీర్ణత సాధించారని తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని రజిత, రావులపెంట జడ్పీహెచ్ఎస్ విద్యార్థిఉత్తెర్ల గోపి 9.8 జీపీఏ సాధించారని తెలిపారు.
మునుగోడు : మండలంలో మొత్తం 393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 390 మంది ఉత్తీర్ణత సాధించారు. కొంపల్లి జడ్పీహెచ్ఎస్కు చెందిన ఎస్.రమాదేవి 10జీపీఏ, ఎం.నరేందర్ 9.8 జీపీఏ పొందారు.
హాలియా: మండలంలో మొత్తం 666 మందికి 600 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మండలంలోని యాచారం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ధనలక్ష్మి 10 జీపీఏ సాధించారు. అదే విధంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన జడ్పీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎంఈఓ బాలూ నాయక్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అభినందించారు.
నిడమనూరు : మిర్యాలగూడ డివిజన్ స్థాయిలో నిడమనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థి పున్న వెంకట్ 10 జీపీఏ సాధించారు. సామ మైథిలీ, దారం అక్షిత 9.8 జీపీఏ, కోరె రమ్య, చిలుకల మన్మిత, మహ్మద్ ఇర్ఫాన్ 9.7 జీపీఏ సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రంజిత తెలిపారు. మండంలోని తుమ్మడం జిల్లా పరిషత్ విద్యార్థ్ధిని బొడ్డుపల్లి రిషిత 10 జీపీఏ, పి. సంధ్యారాణి 9.7 జీపీఏ సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు యుగంధర్రెడ్డి తెలిపారు.
నందికొండ : నందికొండ హిల్కాలనీలోని బీసీ గురుకుల పాఠశాలలో 154 మంది హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించారు. 15 మంది విద్యా ర్థులు 10 జీపీఏ సాధించారు. పైలాన్కాలనీలోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో 49 మంది విద్యార్థ్ధులకు 47 మంది ఉత్తీర్ణత సాధించగా ముగ్గురు విద్యార్థులకు 9.7 జీపీఏ సాధించారు. జెన్కో డీఏవీ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా నలుగురు విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
గుర్రంపోడు : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థిని పోలేపల్లి దీపిక 10 జీపీఏ సాధించినట్లు ఎంఈఓ తరి రాములు తెలిపారు. దీపికను పాఠశాల ప్రిన్సిపాల్ ఎ.అపర్ణ, ఉపా ధ్యాయులు అభినందించారు.
కనగల్ : మండల వ్యాప్తంగా 7 ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, ఆదర్శ పాఠశాల, కస్తూరిబా పాఠశాలల్లో కలిపి 348 మంది విద్యార్థులకు 332మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ తరి రాములు. జి యడవల్లి ఉన్నత పాఠశాల చెందిన సౌమ్య శ్రీ 10జీపీఎ సాధించినట్లు వెల్లడించారు.సౌమ్యశ్రీని ఎంఈఓ తరి రాములు, పాఠశాల హెచ్ఎం పద్మలు అభినందించారు.
దామరచర్ల : పదవ తరగతిలో మండలంలోని గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన ఏ అనిత, ఆర్. మనోజ్ఞ 10 జీపీఏ సాధించినట్లు ఎంఈఓ బాలాజీనాయక్ తెలిపారు. ఏడు పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలను సాధించాయి. ఉత్తమ ఫలితాలకు కృషిచేసిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.
నల్లగొండ రూరల్ : డ్వాబ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నల్లగొండ అంధుల పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి పోనుగోటి చొక్కారావు తెలిపారు. 8 మంది విద్యార్థులు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.