చందంపేట, జూన్ 10: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికే ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నేరేడుగొమ్ము మండలం మోసంగడ్డతండాలో రూ.32.46 లక్షలు, పెద్దమునిగల్ గ్రా మంలో రూ.28.97 లక్షలు, బచ్చాపురంలో రూ. 27.32 లక్షలు, బుగ్గతండాలో రూ.12.91లక్షలతో ఆయా పాఠశాలల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, వసతులు కల్పించేందుకు మన ఊరు మన బడి అమలు చేస్తుందన్నారు.
నేరేడుగొమ్ము మండలం కొత్తపల్లి గ్రామంలో రూ.8లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోవత్ పద్మాహన్మానాయక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, వైస్ ఎంపీపీ ఆరెకంటి ముత్యాలమ్మారాములు, ఎంపీడీఓ ఝాన్సీరాణి, ఏఈ రాజు, ఎంఈఓ సామ్యనాయక్, సర్పంచులు బానోవత్ హంస్యబాయి, పంబలి, అంజయ్య, శ్రీదేవి, పాపానాయక్, కుంభం నరేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, పీఏసీఎస్ చైర్మన్ ముక్కమల బాలయ్య, మార్కెట్ డైరెక్టర్ వడ్త్యా బాలు, వాంకుడోత్ బిక్కూనాయక్, కేతావత్ రవీందర్, బైరెడ్డి కొండల్రెడ్డి, పల్స వెంకటయ్య, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : మన ఊరు- మన బడితో పాఠశాలలకు మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని అన్నెపర్తి, అప్పాజీపేట, ఖాజీరామారం, దండంపల్లి గ్రామాల్లో పాఠశాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా మన ఊరు- మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చేపట్టిందన్నారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మయ్య, ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, నాయకుడు బకరం వెంకన్న, సర్పంచులు చింత పుష్పాసైదులు, మేకల అరవింద్రెడ్డి, రవీందర్రెడ్డి, మున్వర్న్నీసా షబ్బీర్, రాజుపేట మల్లేశ్గౌడ్, సహదేవులు, నగేశ్ పాల్గొన్నారు.
చిట్యాల : మండలంలోని వెలిమినేడు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సామూహిక అక్షరభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆరు అంగన్వాడీ కేంద్రాలకు దాతలు టేకుల కవితాఅంజిరెడ్డి, నాతి మంజులాశ్రీను, ఉప సర్పంచ్ మంకాల మచ్ఛేందర్ రూ.20వేల విలువైన సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, సీడీపీఓ కవిత, సూపర్వైజర్ యశోద, ఎంపీటీసీ దేశబోయిన స్వరూప, హెచ్ఎం నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు అంజయ్య పాల్గొన్నారు.
నాంపల్లి : మండలంలోని ఎస్డబ్ల్యూ లింగోటం, తిర్మలగిరి, పస్నూర్ అంగన్వాడీకేంద్రాల్లో చిన్నారులకు సాముహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత పాల్గొని చిన్నారుల చేత అక్షరాలను రాయించారు.కార్యక్రమంలో సీడీపీఓ లావణ్యకుమారి, సర్పంచ్ పోగుల దివ్య, అంగిరేకుల పండు, ఎంపీటీసీ బెక్కం రమేశ్, శశికళ, పార్వతి పాల్గొన్నారు.
మునుగోడు : పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని కోరుతూ మునుగోడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం సుంకరి భిక్షంగౌడ్ ఎస్ఎంసీ చైర్మన్ పందుల లింగస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.