ఈ నెల 23న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ముగి శాయి. చివరి రోజు ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న స్నేహితులను విడిచి వెళ్లడం ఒకింత భారంగా అనిపించినా పరీక్షలు ముగిశాయన్న సంతోషంలో సెల్ఫీలు దిగుతూ, షేక్హ్యాండ్లు ఇచ్చుకుంటూ ఇంటి బాట పట్టారు. నెల రెండు నుంచి నల్లగొండ లిటిల్ ప్లవర్ హైస్కూల్లో మూల్యాంకనంప్రారంభం కానుండగా, ఏర్పాట్లపై విద్యా శాఖ దృష్టి సారించింది.
రామగిరి, మే 28: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ముగిశాయి. ఈనెల 23న ప్రారంభమైన పరీక్షలు 28తో రెగ్యులర్ పరీక్షలు పూర్తయ్యాయి. చివరి రోజు పరీక్షా కేంద్రాల వద్ద తమ మిత్రులకు బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలికారు. మరికొందరు మొబైల్స్లో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ హస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు ఆనందంతో ఇంటి బాట పట్టారు. ఆర్టీసీ బస్టాండ్లు విద్యార్థులతో సందడిగా కనిపించాయి. కాగా ఓకేషనల్ విభాగానికి సంబంధించి జూన్ 1న పరీక్ష జరుగనుంది.
పరీక్షలు ముగియడంతో పదో తరగతి మూల్యాకనంపై విద్యాశాఖ దృష్టి సారించింది. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో స్పాట్ కేంద్రం(మూల్యాకనం క్యాంపు) ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ సబ్జెక్టుల జవాబుపత్రాలు ఇక్కడికి వచ్చినట్లు విద్యాశాఖాధికారులు వెల్లడించారు.
జూన్ 2 నుంచి 11వరకు స్పాట్ జరుగనుంది. ఇందుకు సంబందించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్హులైన 1200 మంది సీనియర్ ఉపాధ్యాయులకు విధులు నిర్వహించాల్సిందిగా ఇప్పటికే ఉత్తర్వులు అందజేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మూల్యాంకన కేంద్రంలో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు డీఈఓ బి. భిక్షపతి తెలిపారు.